- ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. 23-04-2015 లో అమరావతి ఏపీ రాజధానిగా జీవో విడుదల చేశామని గుర్తుచేశారు.
- ఏ చట్టం ప్రకారం రాజధానిని తరలించాలని చూస్తున్నారని ప్రశ్నించారు.ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రికి పరిపాలించడం తెలియదని మండిపడ్డారు. కక్షలు, కార్పణ్యాలతో రైతుల పొట్ట కొట్టే పరిస్థితికి వచ్చారని నిప్పులు చెరిగారు. ‘ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండు, నీ తిక్క కుదిరే వరకూ వదిలిపెట్టం’ అని జగన్ ను చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని మహిళలు వీరనారీమణులులా పోరాడాలని పిలుపు నిచ్చారు.
previous post
ఫలితాల రోజే కూటమి సమావేశం: చంద్రబాబు