telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

భూ కేటాయింపుల్లో అక్రమాలు..హైకోర్టులో రేవంత్ రెడ్డి పిల్

Revanth-Reddy mp

మైహోమ్స్ సంస్థకు భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. భూ కేటాయింపుల్లో నిబంధనలు తోసిరాజని వందలకోట్ల విలువైన భూములను ఆ సంస్థకు కేటాయించారని ఆరోపించారు.

రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి, రాయదుర్గంలో నిబంధలనకు విరుద్ధంగా 38 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారని తన పిటిషన్లో ఆరోపించారు. హైకోర్టు ఈ పిటిషన్ విచారించి మైం హోంమ్స్ అధినేత రామేశ్వర్ రావుకు, ప్రభుత్వానికి, డీఎల్ఎఫ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కేసును నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.

Related posts