telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చెత్త బుట్టలను సక్రమంగా వినియోగించాలి: మంత్రి హరీష్‌

harish rao trs

ప్రభుత్వం ఇచ్చిన చెత్త బుట్టలను సక్రమంగా వినియోగించాలని తెలంగాణ మంత్రి హరీష్‌రావు ప్రజలకు సూచించారు. ఈరోజు ఆయన సిద్దిపేటలో మార్నింగ్‌వాక్‌ చేసి, అనంతరం.. పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరణ, వేరుచేయడం లాంటి పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. తడి, పొడి చెత్తలను వేరుచేసి.. శానిటేషన్‌ సిబ్బందికి అందించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తడి, పొడి చెత్తలను ఒకే బుట్టలో వేయరాదని మంత్రి తెలిపారు. మంత్రి హరీష్‌ రావు వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ఉన్నారు.

Related posts