telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దిల్ రాజు మేనల్లుడు సరసన అనుపమా పరమేశ్వరన్‌

anupama

మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌క ‘ప్రేమమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమై నసంగతి తిలిసిందే. తొలి సినిమాతోనే ఎక్కడలేని క్రేజ్ సంపాదించేసింది. 2016లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ‘శతమానం భవతి’ సినిమాతో అనుపమకు తెలుగులో ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆ తరవాత ‘కృష్ణార్జున యుద్ధం’, ‘తేజ్ ఐ ల‌వ్ యూ’, ‘హ‌లో గురు ప్రేమకోస‌మే’ సినిమాల్లో నటించింది. అయితే, తాజాగా ఆమె ఒక తెలుగు సినిమాకు సైన్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మేనల్లుడు అశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేయబోతున్నారు. అశిష్ రెడ్డి అరంగేట్రం చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా అనుపమను సంప్రదించారు. నిజానికి దిల్ రాజుతో అనుపమకు మంచి అనుబంధం ఉంది. దిల్ రాజు నిర్మించిన ‘శతమానం భవతి’ సినిమాతో అనుపమకు మంచి బ్రేక్ వచ్చింది. దిల్ రాజు మీద గౌరవంతో ఆయన మేనల్లుడు సరసన నటించడానికి అనుమప వెంటనే అంగీకరించారట. ఈ చిత్రానికి ‘హుషారు’ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు.

Related posts