telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు : మరో 15 మంది అరెస్టు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో తాజాగా మరో 15 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పటివరకు 19 మంది కిడ్నాపర్లను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరొక తొమ్మిది మంది కోసం గాలిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్ రామ్ , చంద్రహాస్, జగద్విఖ్యాతి రెడ్డి, మాదాల శ్రీను, భార్గవ్ రామ్ తల్లిదండ్రుల పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేసులో ఏవీ సుబ్బారెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవీ సుబ్బారెడ్డిగా పోలీసులు గుర్తించారు. బాధితుల వాగ్మూలం ప్రకారం ఈ కేసులో A1 గా ఏవీ సుబ్భా రెడ్డి ఉన్నారు.

Related posts