telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్రామసచివాలయాలు సమర్థవంతంగా పనిచేయాలి: జగన్

ఆశించిన స్థాయిలో ఫలితాలు అందాలంటే గ్రామసచివాలయాలు సమర్థవంతంగా పనిచేయాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల కోసం పలు పథకాలు చేపడుతున్నామన్నారు. సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తేనే ప్రభుత్వం కలలు నిజమవుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

Related posts