జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడే నైతిక హక్కు నారాయణకు లేదని మండిపడ్డారు.మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కు వ్యక్తిత్వమే లేదని నారాయణ చేసిన విమర్శలను తప్పుబట్టారు.
గత ఎన్నికల్లో పవన్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు మీ యొక్క జ్ఞాపకశక్తిని కోల్పోయారా? అని ప్రశ్నించారు. అద్వానీగారి మీద కేసును సీబీఐ కోర్టు కొట్టివేయడంపై మాట్లాడే అర్హత కూడా నారాయణకు లేదని అన్నారు.ప్రధాని మోదీ కాళ్లను పవన్ మొక్కుతున్నారని నారాయణ అన్నారు. గత ఎన్నికల్లో ఆయనతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని నారాయణ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతిని దెబ్బతీయడంతో.. హైదరాబాద్ కు వలసబాట: చంద్రబాబు