telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్‌కు చేరిన రాఫెల్..శత్రు దేశాలకు రాజ్ నాథ్ వార్నింగ్

Raj Nath Singh

భారత్ ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక 36 రాఫెల్‌ యుద్ధవిమానాల్లో ఐదు భారత్‌కు చేరాయి. దీంతో భారత త్రివిధ దళాలలో కొత్త ఉత్సాహం నెలకొంది. అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్న ఐదు రాఫెల్ యుద్ధ విమానాలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్, పలువురు డిఫెన్స్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ… చైనా, పాకిస్థాన్ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.

శత్రు దేశాల యుద్ద విమానాలను తుత్తునియలు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న రాఫెల్ విమానాలతో మన సైనిక వ్యవస్థ శక్తిసామర్థ్యాలు పెరిగాయని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారత్ ను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్న దేశాలకు భారత్ వాయుసేన శక్తిసామర్థ్యాలను చూసి భయపడాల్సిందేనని  అన్నారు.

Related posts