telugu navyamedia
రాజకీయ వార్తలు

కేంద్రం నుంచి సమాచారం వచ్చాక రాజీనామా చేస్తాం: మోపిదేవి

mopidevi venkataramana

ఏపీ శాసన మండలి రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలి రద్దు పై కేంద్రం నుంచి సమాచారం వచ్చాక రాజీనామా చేస్తామని మోపిదేవి వెంకటరమణ రాజీనామా స్పష్టం చేశారు. అమరావతిలో ఈ రోజు  ఆయన మీడియాతో మాట్లాడుతూ…వ్యవసాయ రంగానికి సీఎం అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అలాగే, ఆక్వారంగానికి కూడా ప్రాధాన్యత నిచ్చి ప్రకాశం, గుంటూరు జిల్లాల ఓడరేవులతో పాటు ఉప్పాడలో ఫిషింగ్ జెట్టిలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. దీంతో మంత్రి పదవులకు రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్నకు మోపిదేవి స్పందించారు. ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Related posts