తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
పోలింగ్ పూర్తి కావడంతో అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ను ప్రారంభించారు. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో 12,202 మంది సర్పంచ్ లుగా, 70,094 మంది వార్డ్ మెంబర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, మిగిలిన రెండు విడతల పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా రెండు విడతల పోలింగ్ ఈనెల 25, 30 తేదీల్లో నిర్వహించనున్నారు.