telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మద్యం ప్రియులకు షాక్ : 12 గంటల వరకే వైన్స్ ఓపెన్

కరోనా సెకండ్ వేవ్.. మన ఇండియాను కుదిపేస్తోంది. ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అటు తమిళనాడులోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి కోసం కొన్ని కఠిన ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే మద్యం అమ్మకాలకు కూడా పరిమితులు వర్తింపజేసింది. ఈ మేరకు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను తెరిచి ఉంచే వేళలను కుదించింది. నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. ఈ నెల 20 వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది.

Related posts