telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ లాక్ డౌన్ నిబంధనల్లో మార్పులు..11 గంటల వరకే సరుకులు

ఏపీలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. సీఎం జగన్ సమీక్ష సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ మంత్రి మాట్లాడుతూ… పట్టణాల్లో, నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు నిత్యావసర సరుకుల కోసం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు రావొచ్చని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. పట్టణాల్లో 11 తరువాత, గ్రామాల్లో 1 తరువాత ఎవరూ బయటకు రావొద్దని చెప్పారు. నిత్యావసర సరుకులు బ్లాక్‌ మార్కెట్‌ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి షాప్ వద్ద ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.

Related posts