ఏపీలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. సీఎం జగన్ సమీక్ష సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ మంత్రి మాట్లాడుతూ… పట్టణాల్లో, నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు నిత్యావసర సరుకుల కోసం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు రావొచ్చని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. పట్టణాల్లో 11 తరువాత, గ్రామాల్లో 1 తరువాత ఎవరూ బయటకు రావొద్దని చెప్పారు. నిత్యావసర సరుకులు బ్లాక్ మార్కెట్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి షాప్ వద్ద ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.