telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడతా: బీజేపీ ఎంపీ సంజయ్‌

bandi samjay mp

ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేద ప్రజల కోసం పని చేస్తానని బీజేపీ నేత, కరీంనగర్‌ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్‌ అన్నారు. శుక్రవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ చేరుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు బండి సంజయ్‌ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు.

ఎన్‌డీఏ తరఫున 351 మంది సభ్యులు అధికారంలోకి రావడంతో.. 351 కోడెలను కట్టి రాజన్న మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ.. . రాజన్న ఆశీస్సులతోనే తాను గెలిచానని తెలిపిన ఆయన.. ఆలయ అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భాగస్వామ్యం అవుతానని.. అందరితో కలిసి ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని తెలిపారు.

Related posts