తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపుల వల్లే వైఎస్ జగన్ దగ్గరకు సినీనటులు క్యూ కడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీలో చేరకుంటే వారి ఆస్తులను ఆక్రమిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలోని తమతమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే నటీనటులు అతికష్టంగా వైసీపీ కండువాలు కప్పుకుంటున్నారని మండిపడ్డారు.
ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఒక్కసారే కదా అని తినే అన్నంలో విషం కలుపుకుని తింటామా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మోదీ, దత్తపుత్రుడు జగన్పై ముస్లింలలో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మైనార్టీలపై బీజేపీ దాడులు-దౌర్జన్యాలకు పాల్పడుతుందని చెప్పారు. బీజేపీకే కాదు, వైసీపీకి కూడా మైనారిటీలు బుద్ధిచెప్పాలని చంద్రబాబు అన్నారు. టీడీపీతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఏపీ కేబినేట్ మీటింగ్లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..