కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ అమలవుయతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమవడం, మద్యం షాపులు, బార్లు అన్ని మూసివేయడంతో ఆదాయం తగ్గిపోయింది. మద్యం అమ్మకాలతో జరిగే పన్ను చెల్లింపుల ద్వారా వచ్చే ఆదాయం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
చాలా ప్రాంతాల మాదిరిగానే ఇస్లామిక్ స్టేట్ సిటీ దుబాయ్ లో కూడా ఆల్కాహాల్ అమ్మకాల, ట్యాక్స్ల చెల్లింపులతో వచ్చే ఆదాయం అధికంగానే ఉంటుంది. దీంతో దుబాయ్ ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీకి అనుమతి ఇచ్చింది. దుబాయ్ లో మద్యం అమ్మకాలు చేపట్టే రెండు ప్రధాన కంపెనీలు..ఆదాయానికి గండిపడకుండా డోర్ డెలివరీని చేపడుతున్నాయి. బీర్లు, స్పిరిట్, వైన్ ను రెండు కంపెనీలు ఇంటివద్దకే చేరుస్తున్నాయి.