telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య..నిలిచిపోయిన పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

special train between vijayawada to gudur

నిర్వహణ పనుల కోసం వినియోగించే ఓ టవర్‌ కార్‌ పట్టాలు తప్పడంతో సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య తిరిగే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా బోనకల్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో టవర్‌ కార్‌ పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. ఈ కారణంగా గుంటూరు-సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు జరిపే గోల్కోండ ఎక్స్‌ప్రెస్‌ ఎర్రుపాలెంలో నిలిచిపోయింది.

అలాగే, విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య తిరిగే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ మధిర రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయింది. మరికొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. రాకపోకలకు అంతరాయం లేకుండా చూసేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు.

Related posts