టీవీ ప్రేమికులకు శుభవార్త! మరోసారి కేబుల్, డిష్ చార్జీల తగ్గింపుకు చర్యలు తీసుకుంటుంది ట్రాయ్. కేంద్రం కొన్నాళ్ల కిందట తీసుకువచ్చిన నూతన విధానం వినియోగదారులకు భారంగా మారింది. అనేక చానళ్ల రుసుములు పెరిగిపోయాయి. దాంతో నెలవారీ బిల్లులు చూసి కస్టమర్లు బెంబేలెత్తిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ట్రాయ్ కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు ఊరట కలిగించేలా రంగంలోకి దిగింది. టెలికాం కంపెనీలు చానెల్ ధరలు, బొకే చార్జీలను మరోసారి సమీక్షించాలంటూ ట్రాయ్ ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబరు 16 లోగా ధరల తగ్గింపుపై అభిప్రాయాలు, ప్రతిపాదనలు వెల్లడించాలని స్పష్టం చేసింది.