telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఛత్తీస్‌గడ్‌లో ఎన్ కౌంటర్..ఇద్దరు నక్సల్స్ హతం

naksals encounter

ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. దంతెవాడ జిల్లాలోని కాటేకల్యాన్‌ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. ఈ ఎన్ కౌంటర్ తో ఒక్కసారిగా పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related posts