telugu navyamedia
క్రీడలు వార్తలు

మరోసారి కోహ్లీ పై అభిమానుల ఆగ్రహం.. ఎందుకంటే..?

ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ పరాజయంతో 5 టీ20ల సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకంజలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో పదే పదే తప్పిదాలు చేశారు. క్యాచ్‌లను చేజార్చడంతో పాటు పరుగులను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలోనే శార్దూల్ ఠాకూర్ చేసిన తప్పిదం కెప్టెన్ విరాట్ కోహ్లీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో ఈ యువపేసర్‌పై విరాట్ నోరుపారేసుకున్నాడు. అసభ్య పదజాలంతో యువ పేసర్‌పై నోరు పారేసుకున్నాడు. అప్పటికే బెదురుగా చూసిన శార్దూల్‌, తన తప్పేమీ లేదన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. . దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు, చహల్‌ క్యాచ్‌లు వదిలేసినా పర్లేదు కానీ, శార్దూల్‌ సరిగా త్రో చేయనందుకు ఇంతలా కోప్పడ్డతారా”అని విమర్శిస్తున్నారు.

Related posts