మోహన్ లాల్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’ మలయాళంలో మంచి విజయం సాధించి ఆయన కెరీర్లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. దాంతో ఈ సినిమాను చిరంజీవితో తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తెలుగు రీమేక్కు దర్శకత్వం వహించే భాద్యతను యువ దర్శకుడు సుజీత్ కి అప్పగించినట్టుగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు. అది అలా ఉంటే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో అల్లు అర్జున్ చేయనున్నాడనేది తాజా సమాచారం. మలయాళ ‘లూసిఫర్’ సినిమాలో మోహన్ లాల్ కి నమ్మిన బంటుగా ఉండే జాయేద్ మసూద్ పాత్రలో హీరో పృథ్వీరాజ్ నటించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే పాత్రను తెలుగులో అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందని చిరంజీవి భావిస్తున్నాడట. అంతేకాదు ఆ పాత్రలో నటించాలనీ అల్లు అర్జున్ కూడా ఆసక్తిని చూపుతున్నాడనేది టాక్.
previous post