హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. డిసెంబర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పోలీసులకు ప్రజలందరూ సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు. లోఒ్ఆ ప్రతి ఏడాది కొత్త సంవత్సరం వేడుకలను అంగరంగ వైభవంగా చేసుకుంటారు హైదరాబాద్ వాసులు. ఆ ఒక్కరోజే కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్, కరోనా న్యూ స్ట్రెయిన్ కారణంగా నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. ఈ విషయాన్ని సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. న్యూఇయర్ కోసం ఏర్పాటు చేసుకునే పబ్లిక్, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఇప్పటికే డ్రంకెన్ డ్రైవ్ ను మొదలుపెట్టామని, రిసార్ట్స్, పబ్ లపై నిఘాను ఉంచామని అన్నారు. తాగి వాహనం నడిపితే చర్యలు తీసుకుంటామని అన్నారు. పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదని, గ్రేటర్ కమిటీలో కూడా కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించినట్టు తెలిపారు.
next post
వావిలాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఈటల…