telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో అసలు స్కీములు ఎత్తివేసి చాక్లెట్లు, బిస్కెట్ల స్కీములు పెట్టారు…

tdp leader adinarayana reddy into bjp

ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి రైతులతో ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ లైవ్ కార్యక్రమంను రైతులతో కలిసి చూసారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన బిల్లు పై ప్రతిపక్షాలు లేని పోనీ రాద్దాంతం చేసి రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆదినారాయణ రెడ్డి అన్నారు.మార్పులు చెప్పడం తప్పుదారి కాదని అసలు బిల్లునే వారు తప్పు పట్టడం తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మీడియా సమావేశంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పై ఆదినారాయణ రెడ్డి విమర్శలు చేసారు. తాడిపత్రి లో పెద్దిరెడ్డి ది జేసీ ది ఇద్దరిది తప్పు అన్నారు.పెద్దారెడ్డి కట్టెలు పట్టుకుని కూర్చొని రచ్చకు పోయి చర్చలకు వెళ్లానని చెప్పడం విచిత్రం అన్నారు.తనపై కేసు పెట్టినా ఉపయోగం లేదని అంటున్నాడని అన్నారు. పెద్దారెడ్డి కి ప్రత్యక్షంగా పోలీసుల సహకారం ఉందన్నారు. ఈ సంస్కృతి పోవాలంటే తిరుపతి ఎంపీ ఉపఎన్నికల్లో బీజేపీ ని గెలిపించాలని అన్నారు. రాష్ట్రంలో అసలు స్కీములు ఎత్తి వేసి చాక్లెట్లు, బిస్కెట్లు లాంటి స్కీములు పెట్టారని ఎద్దేవాచేశారు.రాష్ట్రంలో సారాయి స్కాచ్ గా అమ్ముతున్నారని ,4వేల కోట్లు రంగుల్లో పోయింది,ఇసుక బంగారం అయ్యిందని విమర్శించారు.సహకరించని మైనింగ్ వారిని ఇది నాది అని లాక్కుంటున్నారని ఆరోపించారు.

Related posts