మహారాష్ట్రలో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలను పొడిగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ కొనసాగింపు అనివార్యమని, దేశానికి మార్గనిర్దేశనం చేస్తుందని ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడగించాలని ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలపాటు లాక్డౌన్ను పొడిగించాలని సమాలోచనలు చేస్తోంది. అయితే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన ఈ రోజు వెలువడే అవకాశముంది.