telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ ఓ అజ్ఞానవాసి.. మంత్రి అవంతి ఎద్దేవా!

avanthi srinivas minister ap

ఇసుక కొరతను నిరసిస్తూ నిన్న విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఆదివారం జరిగిన సభలో పవన్ అనుభవలేమి, అజ్ఞానం బయటపడ్డాయని అన్నారు. పవన్ ఓ అజ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదివిన ప్రతి ఒక్కరూ రాజకీయనాయకులు కాలేరన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం తపన పడుతున్న పవన్ కల్యాణ్ ఓ సినిమా ఉచితంగా చేశాననుకుని ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వవచ్చు కదా అని హితవు పలికారు.

పార్టీ ఏర్పాటు చేసి ఇప్పటికే పరువు కోల్పోయిన పవన్, ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం ద్వారా మరింత దిగజారిపోతున్నాడని విమర్శించారు. పవన్ ఇంకా సినిమా మాయలోనే ఉన్నాడని, వైసీపీ నేతలకు ఇసుక రవాణాతో సంబంధం ఉందని నిరూపించాలని సవాల్ విసిరారు. లాంగ్ మార్చ్ అని చెప్పి కేవలం 2 కిలోమీటర్లు కూడా నడవలేకపోయారని విమర్శించారు.

Related posts