సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా టాలెంటెడ్ డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్లో ప్రారంభమైంది. అయితే ఈ షెడ్యూల్ ఫిబ్రవరి 21 నాటికి పూర్తి కానుందని సమాచారం. ఇది పూర్తికాగానే ఫ్యాన్స్ను అలరించేందుకు చిన్న వీడియోను విడుదల చేయాలని ‘సర్కారు వారి పాట’ చిత్ర బృందం భావిస్తుందట. దుబాయ్ లోని అద్భుతమైన లొకేషన్స్తో పాటుగా మూవీ సెట్స్ చూపించబోతున్నారని తెలుస్తోంది. రీసెంట్ షెడ్యూల్ లో కథానాయిక కీర్తి సురేష్ హాజరైంది. ఈ మూవీని పరుశురామ్ సోషల్ మెసేజ్ కథతో తెరకెక్కించనున్నాడట. ముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.
previous post
next post