పాప్ సింగర్ కేటి పెర్రీ తొలిసారి ముంబైలో సందడి చేసింది. ఈ పాప్ బ్యూటీ నవంబర్ 16న ముంబైలో నిర్వహించే లైవ్ కాన్సర్ట్ లో పాల్గొనేందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేటి పెర్రీ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొంది. మొదటి రోజు ముంబైలో ఏం చేయాలని ప్లాన్ వేసిందో తెలుసా..?. కేటి పెర్రీకి సల్మాన్ఖాన్, జాక్వెలిన్ కాంబోలో వచ్చిన ‘కిక్’ సినిమా అంటే చాలా ఇష్టమట. అందుకే ముంబైలో తన తొలి సాయంత్రం వేళ కిక్ షో చూసేందుకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇంటికి వెళ్తున్నట్లు కేటి పెర్రీ తెలిపింది. కేటి పెర్రీకి అభిమాని అయిన జాక్వెలిన్ ఓ మై గాడ్..ఇది తనకు గొప్ప క్షణమని ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసింది.
previous post