డిజిటల్ మాధ్యమానికి ప్రాచుర్యం పెరిగిన తర్వాత పలు వెబ్ సిరీస్లు కొత్త కొత్త కాన్సెప్ట్లతో రూపొందుతున్నాయి. సెన్సార్ అడ్డుకట్ట లేకపోవడంతో ఈ వెబ్ సిరీస్ల్లో రొమాంటిక్ సన్నివేశాలు, రక్తపాతం, బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు హిందీకే పరిమితమైన బోల్డ్ వెబ్సిరీస్లు ఇప్పుడు తెలుగులో కూడా రానున్నాయి. బాలీవుడ్ నిర్మాత రోనీ స్కూవాలా తెలుగులో ఓ బోల్డ్ వెబ్సిరీస్ సంపుటిని రూపొందిస్తున్నాడని, హిందీలో వచ్చిన `లస్ట్స్టోరీస్` తరహాలో బోల్డ్ కంటెంట్తో ఈ వెబ్సిరీస్ రూపొందుతుందని తెలుగులో నందినీ రెడ్డి, సందీప్ వంగా, తరుణ్భాస్కర్, సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై వస్తున్న వార్తలకు నటి ఈషారెబ్బా క్లారిటీ ఇచ్చేసింది. తెలుగులోనూ లస్ట్స్టోరీస్ సంపుటి వెబ్సిరీస్గా రానుంది. అయితే ఇది హిందీకి భిన్నంగా ఉంటుందట. ఈ వెబ్సిరీస్ క్లాప్ బోర్డ్ పట్టుకున్న ఫొటోను ఈషారెబ్బా ట్వీట్ చేసింది. ఈమె సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో “లస్ట్ స్టోరీస్”లో నటించింది.
previous post
మహేష్ తో సినిమా… పూరీ సంచలన వ్యాఖ్యలు