telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ట్రంప్ శిష్యుడు జగన్…

cm jagan

విజయనగరం పట్టణ టీడీపీ కమిటీ తో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అశోక్ గజపతిరాజు ఆయన కీలక కామెంట్స్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెంనాయుడు రిలీజ్ కావడం సంతోషంగా ఉందన్న ఆయన వైసీపీ ప్రభుత్వానికి అహం ఎక్కువైపోయిందని అన్నారు. రాజ్యాంగాన్నీ, చట్టాన్ని గౌరవించట్లేదని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. మానవతా విలువలు ఒక్క టీడీపీకే సొంతం అని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పై ప్రభుత్వానికి కోపం ఉందన్నా ఆయన అందుకే భూములు, ఇన్ఫ్రా స్ట్రక్చర్ పై పడి నాశనం చేస్తున్నారని అన్నారు. కేంద్ర నుండి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. వాటికి అడ్డు పడాలని అన్నారు. అందరూ ఒక తాటి మీదకు వచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని బలోపేతం చేయాలని ఆయన అన్నారు. భివృద్ధిలో  ఏపీ రాష్ట్రం హై గ్రోత్ నుండి  స్లో గ్రోత్ కి పడిపోతుందని విచారం వ్యక్తం చేశారు . స్వతంత్ర దేశం మనది, భావితరాలకు సంస్కృతి, సాంప్రదాయాలు అందేంచేలా ఉండాలని ఆయన అన్నారు. ఇక ట్రంప్ శిష్యుడిగా మనకి జగన్ దొరికాడన్న అయన జగన్ అసలు రాజ్యాంగాన్ని పాటించట్లేదని అన్నారు. చూడాలి మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts