telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం…23 మంది మృతి…

ఇరాక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లోని ఓ కరోనా ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 23 మంది కరోనా రోగులు బలి అయ్యారు. శనివారం రాత్రి యిబ్ను ఖతిబ్ ఆస్పత్రి లో చోటు చేసుకున్న ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఆక్సిజన్ ట్యాంక్ పేలిపోవడంతోనే మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో 200 మందికి పైగా కరోనా రోగులతో పాటు వైద్య సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ మంటలు ఆస్పత్రి మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు అందులో ఉన్నవారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. సమాచారం తెలిసిన వెంటనే వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అర్పింది. ఇక అటు ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ ఖాదిమి ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.

Related posts