telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పాక్ లో విజృంభిస్తున్న కరోనా.. రైవిండ్ నగరం లాక్‌ డౌన్‌

corona pakistan

పాకిస్తాన్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తబ్లిగీ జమాత్ సంస్థ వల్ల పాకిస్థాన్‌లో కూడా ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ సంస్థకు చెందిన 40 మత బోధకులకు కరోనా పాజిటివ్ తేలడం కలకలం సృష్టించింది. దాంతో పాకిస్థాన్‌లో తబ్లిగీ జమాత్ ప్రధాన కార్యాలయం ఉన్న రైవిండ్ నగరంలో ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్ విధించింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన పలువురు జమాత్ మతబోధకులను సింధ్, పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రైవిండ్ నగరంలో మెడికల్ స్టోర్లు సహా అన్ని దుకాణాలను మూసి వేయడంతో పాటు ప్రజలెవరూ బయటికి రాకుండా ఆంక్షలు విధించింది.జమాత్‌కు చెందిన మరో 50 మందిలో కూడా వైరస్ అన్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో ఐదుగురు నైజీరియా మహిళలు కూడా ఉన్నారు. వారందరినీ లాహోర్ కు 50 కి.మీ. దూరంలో ఉన్న కసూర్ లోని క్వారంటైన్ సెంటర్లో చేర్చారు. అలాగే, సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్ సిటీలో తబ్లిగీ జమాత్‌ కు చెందిన 38 మందికి లోకల్ ట్రాన్ మిషన్ ద్వారా కరోనా సోకినట్టు గుర్తించారు. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు పాకిస్థాన్‌లో గురువారం వరకు 2250 మందికి వైరస్‌ సోకింది. 32 మంది మరణించారు.

Related posts