సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. పవన్ కండువ కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజాసేవలో పనిచేస్తున్న పవన్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.మంచి జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి పవన్ అని కొనియాడారు.
తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు పవన్కు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీనారాయణతోపాటు కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ మాజీ వీసీ రాజగోపాల్ కూడా పవన్ ఆధ్వర్యంలో జనసేలో చేరారు. అనంతరం పవన్ మాట్లాడుతూ జనసేన పార్టీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలని తాను భావిస్తున్నట్లు అన్నారు. జేడీ ఎక్కడి నుంచి పోటీ చేసే విషయాన్ని సాయంత్రం వెల్లడించనున్నట్లు సమాచారం.