telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

*జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఈ నెల 10వ తేదీన వైద్య శిబిరం – కమిషనర్ రోనాల్డ్ రోస్*

జిహెచ్ఎంసి సిబ్బందికి టిఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఈనెల 10వ తేదీన ఉచితంగా వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

హెడ్ ఆఫీస్ తో పాటుగా జోనల్ ఆఫీస్ లలో కూడా వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి , సికింద్రాబాద్ జోన్ లలో ఏర్పాటు చేశారని అన్నారు. ఈ నెల 12వ తేదీన కూకట్ పల్లి, ఖైరతబాద్ జోన్ లో 17వ తేదీన, చార్మినార్ జోన్ లో 19న, ఎల్ బి నగర్ జోన్ లో 26వ తేదీన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఈ వైద్య ఆరోగ్య శిబిరాలలో బి పి చెక్ అప్, ఎత్తు, బరువు, బి ఎం ఐ, ఆర్ బి ఎస్, ఈ సి జి, 2డి ఏకో (డాక్టర్ సలహాలు) ఇస్తారు.
శిబిరాల కోసం ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. హెడ్ ఆఫీస్ లో ఈ ఈ బిల్డింగ్ మెయింటనెన్స్ ఏర్పాటు చేయాలని సమర్థవంతంగా ఏర్పాటుకు సి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పద్మజా తగు చర్యలు తీసుకోవాలని క కమిషనర్ ఆదేశించారు.

——————————————————-

* – సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.*

Related posts