telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

Accident

ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని బంగారుపాళ్యెం పోలీసు స్టేషన్ పరిధిలో పాలమాకుపల్లె వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో బాబు అనే వ్యక్తి బైక్ పై చిత్తూరు వెళుతూ రోడ్డు క్రాస్ చేస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

అదుపుతప్పిన ఆ కారు ఆ తర్వాత ఓ లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కారులో మరణించినవారిని వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, రత్నంగా గుర్తించారు. వీరు బెంగళూరు వాసులు. కారులో ఉన్న శిరీష అనే యువతికి గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts