బీజేపీ హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమైంది. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-జేజేపీ మధ్య సయోధ్య కుదిరింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. భాజపాకు సీఎం, జేజేపీకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. భేటీ అనంతరం అమిత్ షా ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన చేశారు. జేజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.
జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా… అమిత్ షాతో భేటీలలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. జేజేపీ డిమాండ్లకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దుష్యంత్కు డిప్యూటీ సీఎం పదవి దాదాపు ఖాయమైందని సమాచారం. ఏదిఏమైనా కర్ణాటకలో జేడీఎస్ కి దక్కిన లక్కు ఇప్పుడు జేజేపీ కి చిక్కింది. భవిష్యత్తులో సీఎం స్థాయి అంశాలపైనా ప్రభావం ఉండనుందని నిపుణుల అభిప్రాయం.
మోదీ విమర్శల పై స్పందించిన మాయావతి