టీడీపీ నేత, కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ ధాట్రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగాలని జనార్దన్ ప్రయత్నించారు.
విజయనగరం జిల్లా కురుపాంలో ఆయన వేసిన నామినేషన్ కులవివాదం కారణంగా తిరస్కరణకు గురైంది. జనార్దన్ మృతి వార్తతో టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఆయన హఠాన్మరణం పట్ల ఆ పార్టీ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.