తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అమలవుతోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేపు తలపెట్టిన టీ- కాంగ్రెస్ ర్యాలీ, సభకు పోలీసుల అనుమతి లభించకపోవడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ఇటీవల నిర్వహించిన ఆర్ఎస్ఎస్ సభ గురించి ఉత్తమ్ ప్రస్తావించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడిన మోహన్ భగవత్ సభకు ఎలా అనుమతిచ్చారు? తిరంగా యాత్ర చేస్తామంటే తమకు ఎందుకు అనుమతివ్వరు? అని ప్రశ్నించారు. రేపు ఉదయం పదకొండు గంటలకు గాంధీభవన్ కు తమ నేతలు, నాయకులు, కార్యకర్తలు అందరూ చేరుకోవాలని పిలుపునిచ్చారు.