telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొల్లగొట్టారు: స్పీకర్ తమ్మినేని

ap speaker tammineni

టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొల్లగొట్టారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్తులను నష్టపోతామనే ఉద్దేశంతోనే ఆ ప్రాంత రైతులను టీడీపీ రెచ్చగొడుతుందని విమర్శించారు. విశాఖలో రాజధానిని తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రానికి మూడు రాజధానుల విషయంలో టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాలన అద్భుతంగా ఉందని శాసనసభ కితాబిచ్చారు. నవరత్నాల ద్వారా పేదల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.

Related posts