telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ధర్మాన మతిలేకుండా మాట్లాడుతున్నారు: బుద్ధా ఆగ్రహం

Budha venkanna

ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విర్చుకుపడ్డారు. చంద్రబాబును నోటికొచ్చినట్టుగా మాట్లాడిన ధర్మాన శ్రీకాకుళం 420 అని ఎద్దేవా చేశారు. ఒకరిని వేలెత్తి చూపితే మిగిలిన నాలుగు వేళ్లు మనల్నే చూపుతాయన్న విషయం ధర్మాన గుర్తించాలని అన్నారు. చంద్రబాబును ఎవరూ అనని మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవిని కాపాడుకునేందుకు ధర్మాన మతిలేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

చంద్రబాబును బాగా తిడితే సాక్షి మీడియాలో చూపిస్తారని మంత్రులు ఇష్టానుసారం దుర్భాషలాడుతున్నారని అన్నారు. తాము గతంలో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నందువల్లే ఈ ఎన్నికల్లో 23 సీట్లు మిగిలాయని వైసీపీ నేతలు అంటున్నారన్నారు. మరి తమ ఎమ్మెల్యేలను ఐదుగుర్ని తీసుకున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఐదు సీట్లే ఖాయమని బుద్ధా జోస్యం చెప్పారు.

Related posts