కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రగతిభవన్ లో ప్రారంభం కానుంది. 2020 – 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష జరుపుతారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ జరుపుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. ఇవాళ జరిగే సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమీక్ష అనంతరం.. యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎం సమీక్షిస్తారు.
next post