telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మందడంలో కొనసాగుతున్న బంద్.. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వివాదం!

amaravathi ap

రాజధాని అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ నిన్న ఆందోళన చేపట్టిన మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఈ రోజు జేఏసీబంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే మందడంలో బంద్ కొనసాగుతోంది. రైతులు ఉదయాన్నే రోడ్లపైకి చేరుకుని నిరసనకు దిగారు. దీంతో మందడంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.బందోబస్తుకు వచ్చిన పోలీసులకు నీళ్లు కూడా ఇవ్వకూడదని గ్రామస్థులు నిర్ణయించారు.

అంతేకాదు, గ్రామంలోని దుకాణాల వద్ద పోలీసులు కూర్చోవడానికి కూడా వీల్లేదని రైతులు తెగేసి చెప్పారు. గ్రామంలోకి వెళ్లకుండా పోలీసు వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. బంద్ చేపట్టిన రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Related posts