ఏపీ టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు తదితరులు టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నలుగురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఏపీలో టీడీపీ నాయకత్వంపై ఆ పార్టీ కార్యకర్తలకు విశ్వాసం పోయిందని అన్నారు. చాలామంది నాయకులు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రధాని మోదీ విధానాలు నచ్చి తమ పార్టీలో చేరేందుకు చాలా మంది నాయకులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు.