రాష్ట్ర ప్రజలకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కెసిఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి లోగిలి కార్తీక దీప కాంతులతో వెలగాలని, అన్నదాతల కళ్ళల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని సీఎం కెసిఆర్ ఆకాంక్షించారు. అజ్ఞాన అంధకారాలను తొలగించే విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని కోరుకున్నారు సీఎం కెసిఆర్. అటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని భగవంతున్ని కోరుకుంటున్నా.” అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీ జీవితాన్ని మరింత ప్రకాశవంతంగా చేసి…ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాని పీఎం మోడీ పేర్కొన్నారు.
previous post
పృథ్వీ షా పై పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు…