telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

8 మంది పాక్ సైనికులు హతమార్చిన ఇండియన్ ఆర్మీ…

pak extra army at boarder

భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం హద్దులు మీరి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. బారాముల్లా జిల్లా సరిహద్దుల్లో  పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో చనిపోయినవారిలో  నలుగురు పౌరులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు. పాక్ కాల్పుల్లో చనిపోయిన వారిలో బీఎస్‌ఎఫ్ ఎస్ ఐ రాకేశ్‌ ధోవల్ ఉన్నారు. పాక్‌ ఆర్మీ కాల్పులకు దీటుగా జవాబిస్తోంది భారత ఆర్మీ. భారత బలగాల ప్రతికాల్పుల్లో 8 మంది పాక్ సైనికులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు నుంచి ముగ్గురు వరకూ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ)  కమెండోలు ఉన్నట్టు భారత ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ ‘ఏఎన్ఐ’ వార్తాసంస్థ పేర్కొంది. ఆ కథనం ప్రకారం,  భారత ఆర్మీ ప్రతికాల్పుల్లో 10 నుంచి 12 మంది వరకూ పాక్ సైనికులు గాయపడ్డారు. పెద్దఎత్తున ఆర్మీ బంగర్లు, ఇంధన డంప్‌లు, లాంచ్‌ ప్యాడ్లను కూడా భారత బలగాలు ధ్వంసం చేశాయి. పలు ఆయుధ స్థావరాలు, తీవ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎల్‌ఓసీ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ బరితెగించిన పాక్ రేంజర్లకు భారత బలగాలు శుక్రవారంనాడు గట్టిగా బదులిచ్చాయి.

Related posts