telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా విజృంభణపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్‌ 30 వరకు !

lockdown hyd

మన దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..ఇప్పుడు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 వరకు కరోనా “అన్ లాక్ డౌన్”నిబంధనలను పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి, విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది కేంద్ర హోంశాఖ. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన కరోనా నిబంధనలు, మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు “ఆర్ టి-పీసీఆర్” టెస్టుల సంఖ్య 70 శాతానికి పెంచాలని ఆదేశించింది.
పాజిటివ్ వచ్చిన వారికి సరైన చికిత్స అందించాలని… క్షేత్రస్థాయిలో కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు అమలయ్యేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు మరింత వేగం చేయాలని… కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని తెలిపింది కేంద్రం. అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్ లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ప్రజల రద్దీ బాగా ఉండే ప్రాంతాలలో, పని చేసే ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఆంక్షలు విధించవచ్చని.. అంతరాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని పేర్కొంది.

Related posts