telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 : బ్యాట్ ఝులిపించిన జడేజా.. చెన్నై విక్టరీ

ఐపీఎల్ 2020 లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కత నైట్ రైడర్స్ మధ్య దుబాయ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత జట్టులో ఓపెనర్ నితీష్ రానా (87) పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇక 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన చెన్నై జట్టు చేధనను మంచిగానే ఆరంభించింది. జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (72) అర్ధాష్టకం చేసాడు . కానీ ఆ అతను ఔట్ అయిన తర్వాత సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులో ఉన్న జడేజా బ్యాట్ ఝులిపించారు. దాంతో ఆ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్ చివరి రెండు బవంతులో విజయం సాధించాలంటే చెన్నై 7 పరుగులు చేయాలి. అప్పుడు జడేజా బల్ ను నేరుగా బౌండరీ బయటకు పంపించడంతో చివరి బంతికి ఒక్క పరుగుకు అవసరం అవుతుంది. కానీ ఆ బల్ లో సిక్స్ బాది చెన్నై జట్టుకు ఈ సీజన్ లో 5 వ విజయాన్ని అందించాడు. అయితే ఈ గెలుపు తర్వాత కూడా చెన్నై పాయింట్ల పట్టికలో ఇంకా చివర్లోనే ఉంది. ఇక పరాజయం పొందిన కేకేఆర్ 5 వ స్థానంలో ఉంది.

Related posts