telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోర్టుకు వెళ్లకుండా జగన్ ప్రయత్నాలు: లోకేశ్

Nara Lokesh

ఏపీ సీఎం జగన్ కేసుపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు, విచారణ ఆలస్యం అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని చంపేందుకు త్వరగా కోర్టులో విచారణ పూర్తిచేయాలని అడుగుతున్న సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. లక్ష కోట్ల ప్రజాధనం దోచేసిన వ్యవహారంలో 11 కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలని హితవు పలికారు.

కరోనా వైరస్ భయం వల్ల ఒకసారి కోర్టుకు రావాలంటే రూ.60 లక్షలు అవుతుందని ఒకసారి, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నాను కోర్టుకు రాలేనని చెప్పిన విషయాలను గుర్తు చేశారు. జగన్ ఇలా రకరకాల కారణాలతో విచారణ రాకుండా గడిపేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్నాను కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారని మండిపడ్డారు. అనేక పిటిషన్లతో 10 ఏళ్లు గడిపేశారని మండిపడ్డారు. 

Related posts