నిర్మాత బండ్ల గణేష్ సినిమాల్లో కమెడియన్గా రాణిస్తూనే నిర్మాతగా కూడా ప్రయోగాలు చేసిన బండ్ల గణేష్… గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్లేడు ఇష్యూతో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో తిరిగి కెమెరా ముందుకొచ్చారు. మరోసారి నిర్మాతగా మారి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. మెగా ఫ్యామిలిలో ఇప్పటికే మూడు సినిమాలకు అడ్వాన్స్లు ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా… బండ్ల గణేష్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్ ” అంటూ గణేష్ ట్వీట్ చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.
previous post
next post