telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ ను తిడితే పెద్ద నాయకులు కారు…

తెలంగాణ వచ్చాక సిరిసిల్ల జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. ఇపుడున్న తెలంగాణకు, అప్పటి సమైక్యాంధ్రకు తేడా..శభాష్ పల్లి బ్రిడ్జి నిదర్శనమన్నారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో రహదారులు అభివృద్ధి జరుగుతు న్నాయని..తెలంగాణ వచ్చాక సిరిసిల్ల వాటర్ జంక్షన్ గా మారిందన్నారు. తెలంగాణకు గుండె కాయ మిడ్ మానేరు ప్రాజెక్టు అని.. త్వరలో సిరిసిల్లకు రైల్వే లైన్ వస్తుందని పేర్కొన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని.. తప్పకుండా జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆనాటి కరువు ప్రాంతాలు సిరిసిల్ల, వేములవాడ నేడు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని.. కేసీఆర్ ను తిడితే మీరు పెద్ద నాయకులు కాలేరని మండిపడ్డారు. అయితే ప్రస్తుతం కరీంనగర్ లోని నియోజక వర్గాలలో కేటీఆర్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Related posts