తెలంగాణలో పారామెడికల్ బోర్డు ఆదేశానుసారం 2019-20 విద్యా సంవత్సరానికి మెడికల్ కళాశాలలో పారామెడికల్ కోర్సుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సిద్దిపేట కళాశాల ప్రిన్సిపాల్ తమిళ అరసు అన్నారు. 30 వ తేదీన విద్యార్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.
ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ చదివిన విద్యార్థులు, ఎంపీసీ చదివిన విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో డీఎంఎల్టీలో 20 సీట్లు ఉన్నాయని విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 23 వరకు చివరి తేదీ అని తెలిపారు.
టీఆర్ఎస్ గతే వైసీపీకి పడుతుంది…