telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

బ్రిటన్‌లో కరోనా కల్లోలం .. 5,464కు చేరిన కేసుల సంఖ్య

karona

కరోనా వైరస్ విజృంభించడంతో బ్రిటన్‌ అల్లాడిపోతోంది. ఈ మహమ్మారి ఇంగ్లండ్ లో కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా అక్కడ 24 గంటల్లోనే 888 మంది ప్రాణాలను బలి తీసుకుంది. శనివారం సాయంత్రం నాటికి మొత్తం కేసుల సంఖ్య 15,464కు చేరింది.

యూకేలో ఇప్పటి వరకు 357,023 మందికి కోవిడ్‌-19 పరీక్షలు చేయగా 114,217 మందికి పాజిటివ్‌గా తేలిందని బ్రిటన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మరోవైపు లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ అత్యవసర సేవల సిబ్బంది కోసం లండన్‌లో పరిమిత సంఖ్యలో బస్సులను నడుపుతున్నారు.

Related posts